national

ఇవాళ రాత్రి దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 12:01 PM IST

CM REVANTH REDDY ON INDEPENDENCE
CM Revanth Hoisted Flag at Golconda (ETV Bharat)

CM Revanth Visits Delhi Today :విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ఇవాళ రాష్ట్రాన్ని వీడి ఇంకో పర్యటకు వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి ఆయన దిల్లీకి పయనం కానున్నారు. శుక్రవారం రోజున దిల్లీలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశం అవుతారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో భేటీ అవనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర నూతన పీసీసీ చీఫ్ ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని, వరంగల్ రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details