Officers Seized Four Kg Gold From Travel Bus : సంగారెడ్డి జిల్లాలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ అండ్ ఎక్సైజ్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 4 కేజీల 840 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్న బ్యాగును గుర్తించారు.
Published : Aug 6, 2024, 6:49 PM IST
ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 4 కిలోల బంగారం తరలింపు - స్వాధీనం చేసుకున్న సంగారెడ్డి పోలీసులు
Officers Seized Four Kg Gold From Travel Bus (ETV Bharat)
సరైన పత్రాలు చూపించకపోవడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు బంగారంతో పాటు చంద్రేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.4 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. బంగారంతో పాటు చంద్రేశ్ను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు సంగారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు.