national

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 6:49 PM IST

ETV Bharat / snippets

ప్రైవేట్‌ ట్రావెల్ బస్సులో 4 కిలోల బంగారం తరలింపు - స్వాధీనం చేసుకున్న సంగారెడ్డి పోలీసులు

Officers Seized Gold in Sangareddy
Officers Seized Four Kg Gold From Travel Bus (ETV Bharat)

Officers Seized Four Kg Gold From Travel Bus : సంగారెడ్డి జిల్లాలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద టాస్క్​ఫోర్స్ అండ్ ఎక్సైజ్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 4 కేజీల 840 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్న బ్యాగును గుర్తించారు.

సరైన పత్రాలు చూపించకపోవడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు బంగారంతో పాటు చంద్రేశ్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.4 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. బంగారంతో పాటు చంద్రేశ్​ను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు సంగారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details