వరద బాధితులకు మరో శుభవార్త - స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2024, 10:29 PM IST
Stamp Duty Exemption to Flood Victims in AP :ఇటీవల రాష్ట్రంలో వర్షాలు, వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మరో లబ్ది చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 వేల రూపాయల వరకు రుణాల రీ-షెడ్యూల్ చేసుకున్న వారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా వరద ప్రభావిత పది జిల్లాల్లో వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.