Old Couple Murdered in Hyderabad Ambarpet : తెలంగాణలోని హైదరాబాద్ బాగ్అంబర్పేట్లో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. స్థానిక సాయిబాబా కాలనీకి చెందిన లింగారెడ్డి, ఊర్మిళాదేవిని దుండగులు ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చారు. రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో బంధువులు దంపతుల ఇంటికి వెళ్లి చూడగా వారిద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. మృతురాలి మెడలో బంగారు ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు CCTV ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్లో వృద్ధ దంపతుల దారుణహత్య - నగల కోసమేనా ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2024, 9:22 PM IST
Old Couple Murdered in Hyderabad Ambarpet : తెలంగాణలోని హైదరాబాద్ బాగ్అంబర్పేట్లో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. స్థానిక సాయిబాబా కాలనీకి చెందిన లింగారెడ్డి, ఊర్మిళాదేవిని దుండగులు ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చారు. రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో బంధువులు దంపతుల ఇంటికి వెళ్లి చూడగా వారిద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. మృతురాలి మెడలో బంగారు ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు CCTV ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.