Labourers Killed In Terrorist Attack : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. గాందర్బల్ జిల్లాలోని సోన్మార్గ్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలోని కార్మికుల క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఘటనాస్థలికి చేరుకుని- ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కాగా, రెండు రోజుల క్రితమే షోపియాన్ జిల్లాలో బిహార్కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.
#WATCH | J&K: Terror incident in Gagangeer, Ganderbal. The area was cordoned off by security forces. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) October 20, 2024
(Visuals deferred by unspecified time) pic.twitter.com/6ySgcrqZ79
తీవ్రంగా ఖండిస్తున్నా : ఒమర్ అబ్దుల్లా
ఈ ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. "సోనామార్గ్ ప్రాంతంలోని గగాంగీర్లో వలస కార్మికులపై జరిగిన దారుణమైన, పిరికి దాడి చాలా విచారకరం. కార్మికులు ఈ ప్రాంతంలో కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఇద్దరు చనిపోయారు. మరో 2-3 గాయాలపాలయ్యారు. నిరాయుధులైన అమాయకులపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. " అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
భద్రత కట్టుదిట్టం- ఘటనాస్థలికి ఐజీ
ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల. కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిర్డి గగన్గీర్, గందర్బాల్ చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
#WATCH | J&K: IG Kashmir Zone police VK Birdi arrived at Gagangeer, Ganderbal the terror incident spot. The area was cordoned off by security forces.
— ANI (@ANI) October 20, 2024
(Visuals deferred by unspecified time) pic.twitter.com/kDupnBsER1