national

ETV Bharat / snippets

అదుపుతప్పిన అద్దె కారు- ఘటన స్థలంలోనే డ్రైవర్, ప్రయాణికుడు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 3:32 PM IST

Updated : Aug 17, 2024, 5:19 PM IST

car_accident
car_accident (ETV Bharat)

Road Accident in Guntur District :గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పెదకాకానికి చెందిన దుర్గాప్రసాద్ ఏడాది క్రితం కొత్తగా కారు కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతున్నాడు. శుక్రవారం రాత్రి గుంటూరు నుంచి వెల్లటూరుకు వెళ్లాడు. ప్రయాణికులను దింపి ఇవాళ తెల్లవారుజామున గుంటూరు బయలుదేరాడు. ఈ క్రమంలో వెల్లటూరుకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని కారులో ఎక్కించుకున్నాడు. వీరు ప్రయాణిస్తున్న కారు పెదరావూరు గ్రామ శివారుకు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Last Updated : Aug 17, 2024, 5:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details