national

సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల చొప్పున విరాళం అందించిన రవి రహేజా, జీవీకే రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 10:14 PM IST

Flood Donations in Telangana
Flood Donations in Telangana (ETV Bharat)

Flood Donations in Telangana : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలువురు దాతలు విరాళాల చెక్కులు అందజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా అందించారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి సీఎం సహాయనిధికి రూ.5 కోట్లు విరాళం అందించారు. అలాగే వెళ్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- వీట్‌ ఫౌండర్, ఛాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ సీఎం సహాయనిధికి రూ.కోటి 50 లక్షలు విరాళం అందించారు.కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్ కంపెనీ ఎండీ నర్సింహా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జలంధర్‌రెడ్డిలు సీఎం సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. ఎన్‌సీసీ ఎండీ రంగరాజు, డైరెక్టర్ సూర్యలు రూ.కోటి విరాళం అందచేశారు.

ABOUT THE AUTHOR

...view details