national

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 3:23 PM IST

Municipal Corporation Office
Municipal Corporation Office (ETV Bharat)

Security At Warangal Municipal Corporation Office: వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరగబోయే బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు పట్టిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్​గా గెలిచి, మేయర్ పదవి దక్కించుకున్న సుధారాణి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన రహదారులను భారీ గేట్లతో ఎక్కడికక్కడే మూసివేశారు.

ABOUT THE AUTHOR

...view details