రెండు రోజులు పోలీసు కస్టడీకి పిన్నెల్లి - జైల్లోనే ప్రశ్నిస్తున్న అధికారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 5:17 PM IST
Officials Investigating Former YSRCP MLA Pinnelli:నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అధికారులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో జైల్లోనే పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నారు. విచారణ అధికారి శ్రీనివాసరావు నేతృత్వంలో ఒక సీఐ, ఎస్సై పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నారు. విచారణ ప్రక్రియను వీడియో తీయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామంలో పోలింగ్ రోజు పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారు. అడ్డుకోబోయిన తెలుగుదేశం కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో విధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి సోదరులు సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం చేశారు. ఈ కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించగా నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.