ETV Bharat / state

ప్రతిష్టాత్మకంగా ఏపీలో డ్రోన్‌ సమ్మిట్‌- బెస్ట్ డ్రోన్లకు నజరానాలు - Amaravati Drone Summit 2024

Amaravati Drone Summit 2024 : దేశంలోనే డ్రోన్ల రంగంలోనే తొలిస్థానంలో కైవసం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగా మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ను నిర్వహించేందుకు సిద్దమవుతోంది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Amaravati Drone Summit 2024 Logo and Website Launche
Amaravati Drone Summit 2024 Logo and Website Launche (ETV Bharat)

Amaravati Drone Summit 2024 Logo and Website Launched : అక్టోబర్‌ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ -2024 ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దానికన్నా ముందు విజయవాడలో హ్యాకథాన్‌ను కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డ్రోన్‌ సమ్మిట్‌ లోగో, వెబ్‌సైట్‌ను విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌, ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌కుమార్ ఆవిష్కరించారు. సదస్సుకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు హాజరవుతారని తెలిపారు. డ్రోన్ కేపిటల్‌గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

డ్రోన్ సాంకేతికత - వినియోగం, ఎదురయ్యే సవాళ్లు : ఈ సందర్భంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, డ్రోన్ సాంకేతికత - వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. డ్రోన్లలో తీసుకురావాల్సిన నూతన టెక్నాలజీ సహా అధ్యయనం పై సమ్మిట్​లో నిపుణులతో చర్చిస్తామన్నారు. ఏ విభాగాల్లో డ్రోన్లు వాడి మెరుగైన సేవలు పొందవచ్చనే విషయాలపై ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నామని తెలిపారు. వీటి రూపకల్పనపై సమ్మిట్​లో చర్చిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు సమ్మిట్​లో పాల్గొంటారని తెలిపారు.

డ్రోన్ల ద్వారా మందుల సరఫరా - పైలట్ ప్రాజెక్టు విజయవంతం - Medicines Delivering with Drones

అక్టోబర్‌ 15 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు : సమ్మిట్​కు వచ్చే వారు అమరావతి డ్రోన్ సమ్మిట్ వెబ్ సైట్ లో ఈ నెల 15 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. సమ్మిట్​లో భాగంగా విజయవాడలో హ్యాకథాన్​ను కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5 వేల డ్రోన్లతో విజయవాడ బరం పార్క్​లో డ్రోన్ షో నిర్వహిస్తామని తెలిపారు. భారీ డ్రోన్ షో ను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చన్నారు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. ఎంపికైన డ్రోన్​లకు తొలి బహుమతిగా రూ. 3 లక్షలు, రెండో బహుమతి రూ. 2 లక్షలు, మూడో బహుమతి 1లక్ష రూపాయలు బహుమతి ఇస్తామన్నారు.

దేశంలో తొలిసారిగా 5వేల డ్రోన్లతో షో : డ్రోన్ కేపిటల్​గా ఏపీ మారాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని, దీన్ని నెరవేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రోన్ సమ్మిట్ లో ప్రజలు, విద్యార్థులు, నిపుణులు, తయారీ దారులు ఎవరైనా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనవచ్చని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారి 5వేల డ్రోన్లతో నిర్వహంచే డ్రోన్ షో ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించామని ప్రజలు వినియోగించుకోవాలని ఏపీ డ్రోన్స్ కార్పోరేషన్ ఎండీ దినేష్ కుమార్ తెలిపారు.

శరవేగంగా పారిశుద్ధ్య పనులు - డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి - drones for vijayawada sanitation

విజయవాడ బాధితులకు అండగా ప్రభుత్వం - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ ముమ్మరం - FOOD DELIVERY WITH DRONES

Amaravati Drone Summit 2024 Logo and Website Launched : అక్టోబర్‌ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ -2024 ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దానికన్నా ముందు విజయవాడలో హ్యాకథాన్‌ను కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డ్రోన్‌ సమ్మిట్‌ లోగో, వెబ్‌సైట్‌ను విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌, ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌కుమార్ ఆవిష్కరించారు. సదస్సుకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు హాజరవుతారని తెలిపారు. డ్రోన్ కేపిటల్‌గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

డ్రోన్ సాంకేతికత - వినియోగం, ఎదురయ్యే సవాళ్లు : ఈ సందర్భంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, డ్రోన్ సాంకేతికత - వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. డ్రోన్లలో తీసుకురావాల్సిన నూతన టెక్నాలజీ సహా అధ్యయనం పై సమ్మిట్​లో నిపుణులతో చర్చిస్తామన్నారు. ఏ విభాగాల్లో డ్రోన్లు వాడి మెరుగైన సేవలు పొందవచ్చనే విషయాలపై ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నామని తెలిపారు. వీటి రూపకల్పనపై సమ్మిట్​లో చర్చిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు సమ్మిట్​లో పాల్గొంటారని తెలిపారు.

డ్రోన్ల ద్వారా మందుల సరఫరా - పైలట్ ప్రాజెక్టు విజయవంతం - Medicines Delivering with Drones

అక్టోబర్‌ 15 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు : సమ్మిట్​కు వచ్చే వారు అమరావతి డ్రోన్ సమ్మిట్ వెబ్ సైట్ లో ఈ నెల 15 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. సమ్మిట్​లో భాగంగా విజయవాడలో హ్యాకథాన్​ను కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5 వేల డ్రోన్లతో విజయవాడ బరం పార్క్​లో డ్రోన్ షో నిర్వహిస్తామని తెలిపారు. భారీ డ్రోన్ షో ను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చన్నారు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. ఎంపికైన డ్రోన్​లకు తొలి బహుమతిగా రూ. 3 లక్షలు, రెండో బహుమతి రూ. 2 లక్షలు, మూడో బహుమతి 1లక్ష రూపాయలు బహుమతి ఇస్తామన్నారు.

దేశంలో తొలిసారిగా 5వేల డ్రోన్లతో షో : డ్రోన్ కేపిటల్​గా ఏపీ మారాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని, దీన్ని నెరవేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రోన్ సమ్మిట్ లో ప్రజలు, విద్యార్థులు, నిపుణులు, తయారీ దారులు ఎవరైనా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనవచ్చని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారి 5వేల డ్రోన్లతో నిర్వహంచే డ్రోన్ షో ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించామని ప్రజలు వినియోగించుకోవాలని ఏపీ డ్రోన్స్ కార్పోరేషన్ ఎండీ దినేష్ కుమార్ తెలిపారు.

శరవేగంగా పారిశుద్ధ్య పనులు - డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి - drones for vijayawada sanitation

విజయవాడ బాధితులకు అండగా ప్రభుత్వం - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ ముమ్మరం - FOOD DELIVERY WITH DRONES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.