మరోసారి ఆందోళనకు దిగిన నిజాం కళాశాల యూజీ విద్యార్థులు - హాస్టల్ పూర్తిగా కేటాయించాలని డిమాండ్
Published : Aug 13, 2024, 11:01 PM IST
Nizam UG College Students Protest For Hostels : హైదరాబాద్ బషీర్బాగ్లో నిజాం కళాశాల యూజీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. వసతి గృహాన్ని పూర్తిగా డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12లోపు సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన హామీ అమల్లోకి రాలేదన్నారు. సర్కులేషన్ రాకపోవడం వల్లే మళ్లీ నిరసనకు దిగినట్లు డిగ్రీ విద్యార్థినిలు తెలిపారు. హాస్టల్ పూర్తిగా కేటాయించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.