విశాఖలో నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి పర్యటన - కమాండ్ కార్యకలాపాలపై సమీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 7:26 PM IST
Navy Chief Dinesh Kumar Tripathi visit Eastern Naval Base at Visakha:విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో భారత నౌకా దళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి పర్యటించారు. నేవీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తూర్పునౌకా దళ ప్రధాన స్థావరాన్ని ఇతర యూనిట్లను సందర్శించడం ఇదే తొలిసారి. ఆయన సతీమణి, నేవల్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ (NWWA) అధ్యక్షులు శశి త్రిపాఠితో కలిసి ఆయన ఈ పర్యటన పాల్గొన్నారు. తూర్పునౌక దళ ప్రధానాధికారి రాజేష్ పెంధార్కర్ సహా ఇతర అధికారులతో కమాండ్ కార్యకలాపాలపై సమీక్షించారు. నేవీ చీఫ్ పర్యటన సందర్భంగా గౌరవ వందనాన్ని సమర్పించిన తూర్పు నౌకాదళం సమర్పించింది. కమాండ్ ద్వారా వివిధ కార్యాచరణ కార్యకలాపాలు, వివిధ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు.