మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు - 18న కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్న కోర్టు
Published : 12 hours ago
Minister Konda Surekha Case Updates :మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇవాళ నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వర్రావు వాదనలు విన్న న్యాయస్థానం, ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు నలుగురు సాక్షులు స్టేట్మెంట్లు రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేటీఆర్, సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.