Father Leaves His Three Children in Dasara Celebrations : దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోవాలని ప్రయత్నించగా, పోలీసులు పట్టుకుని వారింటికి చేర్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలం కల్పగూర్కు చెందిన శ్రీశైలం మద్యం మత్తులో అంబేడ్కర్ మైదానంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలకు తన ముగ్గురు పిల్లలు 2 నెలల పసికందు శ్రీలీల, ఆరేళ్ల అర్చన, మూడేళ్ల వయసుండే మహేందర్ను తీసుకొచ్చాడు. జనంలోనే ఒక్కసారిగా పసికందును కిందపడేసి అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ గమనించి పక్కనే ఉన్న కానిస్టేబుల్ గౌరిని అలర్ట్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయగా, శ్రీశైలం తప్పించుకొని పరారయ్యాడు. సుమారు గంటసేపు గాలించిన పోలీసులు ఎట్టకేలకు శ్రీశైలంను పట్టుకున్నారు. పిల్లలు, తండ్రిని కల్పగూరులోని వారింటికి తీసుకెళ్లి కుటుంబీకులకు అప్పగించారు.
ముగ్గురు పిల్లలను వదిలేసి ఉడాయించిన తండ్రి - గంట తర్వాత?
Published : 15 hours ago
Father Leaves His Three Children in Dasara Celebrations : దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోవాలని ప్రయత్నించగా, పోలీసులు పట్టుకుని వారింటికి చేర్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలం కల్పగూర్కు చెందిన శ్రీశైలం మద్యం మత్తులో అంబేడ్కర్ మైదానంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలకు తన ముగ్గురు పిల్లలు 2 నెలల పసికందు శ్రీలీల, ఆరేళ్ల అర్చన, మూడేళ్ల వయసుండే మహేందర్ను తీసుకొచ్చాడు. జనంలోనే ఒక్కసారిగా పసికందును కిందపడేసి అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ గమనించి పక్కనే ఉన్న కానిస్టేబుల్ గౌరిని అలర్ట్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయగా, శ్రీశైలం తప్పించుకొని పరారయ్యాడు. సుమారు గంటసేపు గాలించిన పోలీసులు ఎట్టకేలకు శ్రీశైలంను పట్టుకున్నారు. పిల్లలు, తండ్రిని కల్పగూరులోని వారింటికి తీసుకెళ్లి కుటుంబీకులకు అప్పగించారు.