Minister Sridhar Babu on IT Industries : దేశంలో 7 రాష్ట్రాలలో కేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడం శుభసూచకమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లోని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్లో గ్లోబల్ లీడర్ అయిన కేన్స్ తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఉపాధి అవకాశములో యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి శ్రీధర్ బాబు
Published : Aug 23, 2024, 7:57 PM IST
Minister Sridhar Babu on IT Industries (ETV Bharat)
ఎలక్ట్రానిక్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పనులు ప్రారంభించిందని తెలిపారు.