Fisheries Corporation Chairman Mettu Sai :తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మెట్టు సాయికుమార్ను పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు అభినందించారు. ఇవాళ మాసబ్ట్యాంక్ మత్స్య భవన్లో సాయికుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో మెట్టు సాయికుమార్కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్గా మెట్టు సాయికుమార్ పదవీ బాధ్యతలు - అభినందించిన కాంగ్రెస్ నాయకులు
Published : Jul 20, 2024, 10:27 PM IST
తెలంగాణ ఎంపీల ఫోరం ఛైర్మన్ మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ ఛైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, నూతి శ్రీకాంత్ గౌడ్, వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్ తదితరులు మెట్టు సాయికుమార్ను కలిసి అభినందించారు. ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్గా తాను మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడతానని మెట్టు సాయికుమార్ తెలిపారు.