national

నాగర్​కర్నూల్​లో రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 9:19 AM IST

ROAD ACCIDENT AT AMRABAD TODAY
Road Accident in Nagar Kurnool (ETV Bharat)

Road Accident in NagarKurnool Today :వాహనం చెట్టుకు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదస్థలిలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం ఇవాళ ఉదయం అమ్రాబాద్ మండలంలోని దోమసపెంట వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులను మేడ్చల్‌ జిల్లా బొల్లారం వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details