national

కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు మరోసారి పొడిగింపు - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 7:41 PM IST

Justice pc ghosh commission
Justice pc ghosh commission (ETV Bharat)

Justice PC Ghosh Commission :కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. మొదట కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో ఇచ్చిన 100 రోజుల సమయం ముగియడంతో జులై, ఆగస్టు రెండు నెలల పాటు గతంలో పొడిగించారు. ఇవాళ్టితో ఆ గడువు పూర్తవ్వడంతో మరో 2 నెలల పాటు కమిషన్ గడువును పొడిగిస్తూ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలువురిని కమిషన్ విచారించింది.

ABOUT THE AUTHOR

...view details