national

లైంగిక వేధింపుల ఆరోపణలు - జానీ మాస్టర్​పై జనసేన పార్టీ చర్యలు

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 5:42 PM IST

JOHNNY MASTER issue
Johnny Master Controversy (ETV Bharat)

Johnny Master Controversy :లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలకు షేక్ జానీ దూరంగా ఉండాలని ఆ పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్​మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

నార్సింగి పోలీస్ స్టేషన్​లో జానీ మాస్టర్​పై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజయ్ కుమార్ వెల్లడించారు. జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న జానీ మాస్టర్, 2023లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. పవన్‌ కల్యాణ్​కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్, ఆయన సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేశాడు.

ABOUT THE AUTHOR

...view details