చర్చిలో ప్రార్థన చేస్తుండగా బ్లేడుతో దాడి చేసిన భర్త - ప్రాణాపాయస్థితిలో భార్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : 22 hours ago
|Updated : 22 hours ago
Husband who Attacked His Wife with Blade in YSR District : భార్యపై అనుమానంతో బ్లేడుతో భర్త దాడి చేసిన సంఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. జమ్మలమడుగు ఉన్న టౌన్ చర్చిలో ప్రార్థన చేస్తున్న మేరీపై భర్త విజయ్ వెనుక నుంచి వచ్చి ఆమె మెడ, కుడి చెంపపై బ్లేడుతో కోశాడు. దీంతో స్థానికులు బాధితురాలిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మేరీని మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్యపై అనుమానంతోనే తన భర్త బ్లేడుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.