Chiranjeevi 50 Years : మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో అరుదైన మైలురాయి అందుకున్నారు. నట ప్రస్థానంలో ఆయన శనివారంతో 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన నట ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన డిగ్రీ చదువుతున్న రోజుల్లో 'రంగస్థలం' మీద వేసిన తొలి నాటకానికి సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేశారు.
'రాజీనామా' Y N M College నర్సాపూర్లో 'రంగస్థలం' మీద తొలి నాటకం. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు. అది ఉత్తమ నటుడు కావడం, ఎనలేని ప్రోత్సాహం. 1974 - 2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం, ఎనలేని ఆనందం! ' అంటూ పోస్ట్కు క్యాప్షన్ రాసుకొచ్చారు.
90'ల్లో నుంచే బ్లాస్బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి తెలుగు సినిమాపై ముద్ర వేశారు. ఆయన సినీ కెరీర్లో ఇప్పటివరకు 150+ చిత్రాల్లో నటించి అనేక అవార్డులు దక్కించుకున్నారు. 60ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో హుషారుగా స్టెప్పులేస్తూ, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.
‘రాజీనామా' .. Y N M College Narsapur లో 'రంగస్థలం' మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం ! 🙏 pic.twitter.com/CfobnApui8
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 26, 2024