Gold Scam Gang Arrested in Hyderabad :బంగారం తక్కువ ధరకు ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్న ముఠాను రాచకొండ కమిషనరేట్లోని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులు ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి రూ.6.86 కోట్ల ఫేక్ కరెన్సీ, మూడు కార్లు, 5 కిలోల నకిలీ బంగారు బిస్కెట్లు, రూ.51లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Published : Jun 18, 2024, 7:17 PM IST
గోల్డ్ స్కామ్ను బట్టబయలు చేసిన రాచకొండ పోలీసులు - నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
జ్యువెల్లరీ దుకాణదారులను సంప్రదించి తమ వద్ద కస్టమ్స్ నుంచి తెచ్చిన బంగారం ఉందని, వాటిని తక్కువ ధరకు ఇస్తామని చెబుతున్నారు. తొలుత నమ్మించేందుకు కొంత అసలైన బంగారం ఇస్తున్నారు. తిరిగి అధిక మొత్తంలో గోల్డ్ కావాలని కోరగా, డమ్మీ బంగారు బిస్కెట్లను బాక్సులో తెచ్చి ఇస్తున్నారు. వాటిని తీసుకుని వెళ్లే క్రమంలో పోలీసు అధికారిలా నిందితుల్లో కొందరు వ్యవహరించి బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. ఇలా వరుస నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.