Doultabad Tractor Accident : వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం వీర్లపల్లి గ్రామంలో అంత్యక్రియలకు వెళ్తూ ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం బంధువు అంత్యక్రియల నిమిత్తం ఈర్లపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్లో వెళ్తుండగా గోక ఫస్ట్లాబాద్ శివారులో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
వికారాబాద్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా - మహిళ మృతి, ఐదుగురికి గాయాలు
Published : 5 hours ago
Doultabad Tractor Accident : వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం వీర్లపల్లి గ్రామంలో అంత్యక్రియలకు వెళ్తూ ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం బంధువు అంత్యక్రియల నిమిత్తం ఈర్లపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్లో వెళ్తుండగా గోక ఫస్ట్లాబాద్ శివారులో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.