national

అపెండెక్స్‌ ఆపరేషన్‌ కోసం వస్తే ప్రాణం పోయింది - అసలేం జరిగింది?

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 7:24 PM IST

Girl Died Due to Negligence of Doctors
Girl Died Due to Negligence of Doctors (ETV Bharat)

Girl Died Due to Negligence of Doctors : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కుబీర్‌ మండల కేంద్రానికి చెందిన బాలిక కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అపెండెక్స్‌ అని చెప్పారు.

అయితే డాక్టర్‌ మాత్రం చికిత్స వద్దని చెప్పారు. డాక్టర్‌ వద్దని చెప్పడంతో ఆపరేషన్‌ చేయలేదు. దీంతో బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం ఆ బాలిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details