Girl Died Due to Negligence of Doctors : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కుబీర్ మండల కేంద్రానికి చెందిన బాలిక కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అపెండెక్స్ అని చెప్పారు.
అపెండెక్స్ ఆపరేషన్ కోసం వస్తే ప్రాణం పోయింది - అసలేం జరిగింది?
Published : Jun 29, 2024, 7:24 PM IST
Girl Died Due to Negligence of Doctors (ETV Bharat)
అయితే డాక్టర్ మాత్రం చికిత్స వద్దని చెప్పారు. డాక్టర్ వద్దని చెప్పడంతో ఆపరేషన్ చేయలేదు. దీంతో బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం ఆ బాలిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.