Published : Sep 28, 2024, 11:43 AM IST
డీసీఎం వ్యాన్ బోల్తా - వాహనంలో తరలిస్తున్న 16 ఆవులు మృతి
Few Cows Died by DCM Overturn : డీసీఎం వ్యాన్ బోల్తా పడి 16 ఆవులు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల శివారులో జరిగింది. శనివారం ఉదయం ఆవుల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ వావిలాల శివారులో మలుపు వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 16 ఆవులు మృతిచెందగా మరికొన్నింటి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఈ వాహనం, డ్రైవర్ అతివేగం వల్ల బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం వైపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.