national

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 9:53 PM IST

ETV Bharat / snippets

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఈనాడు విలేకరి మృతి

Nirmal Road Accident
Eenadu Journalist Died in Road Accident (ETV Bharat)

Eenadu Journalist Died in Road Accident Today :నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని హంగీర్గ -ఎల్వీ గ్రామాల మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని తానూర్ మండల ఈనాడు విలేకరి యతలం గంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎల్వీ గ్రామానికి చెందిన ఈనాడు విలేకరి గంగారెడ్డి తన ద్విచక్ర వాహనంపై భైంసా నుంచి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details