Published : Jun 19, 2024, 1:12 PM IST
'ఒక్కరోజైనా రామోజీరావులా బతికితే చాలు'
Ramoji Rao Condolence Program at Khammam : ఖమ్మం జిల్లా మధిరలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు రామోజీరావుతో తమకు ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు. రామోజీరావు తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన అక్షర యోధుడని మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు పేర్కొన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ప్రశంసించారు. ఆయన బాటలో తెలుగు ప్రజలందరూ నడయాలని సూచించారు. రామోజీరావు గారిలా ఒక్కరోజు బతికినా చాలు అని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిని తెలుగుజాతి కోల్పోయిందని వక్తలు పేర్కొన్నారు.