Published : Jul 22, 2024, 2:55 PM IST
|Updated : Jul 22, 2024, 4:36 PM IST
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ఆగస్టు 5కు వాయిదా
MLC Kavitha Bail Denied in Delhi Liquor Scam : దిల్లీ మద్యం విధానం, సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఆగష్టు 5కు వాయిదా వేసింది. మరోవైపు దిల్లీ మద్యం విధానం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు, జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచాలని సీబీఐని ఆదేశించింది. చార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని సూచించింది. దిల్లీ మద్యం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న చార్జిషీట్ దాఖలు చేసింది.