national

పండుగ పూట విషాదం - గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 6:53 PM IST

Police Died of Heart Attack at Warangal
Constable Died of Heart Attack at Warangal (ETV Bharat)

Constable Died of Heart Attack at Warangal :పండుగ వేళ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్​లో సీఐ రమణమూర్తి ప్రత్యేక గన్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న కొమరం జగన్ గుండెపోటుతో ఈరోజు మధ్యాహ్నం మృతి చెందాడు. పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్​లో వినాయక చవితిని పురస్కరించుకుని కానిస్టేబుళ్లు అందరూ కలిసి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రుల ఉత్సవాలు జరిపేందుకు మండపం నిర్మాణం ఏర్పాట్ల పనుల్లో జగన్​ పాల్గొన్నాడు.

అనంతరం ఇంట్లోకి వెళ్లి నిద్రించే క్రమంలో వాంతి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. కానిస్టేబుల్ జగన్ మృతి పోలీస్ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రమణ మూర్తి, ఎస్సైలు, తోటి కానిస్టేబుల్స్​ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details