హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ - స్వాగతం పలికిన సీఎం రేవంత్
Published : Jul 31, 2024, 3:35 PM IST
CM Revanth Welcomed Jishnu Dev Varma at Airport : తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ నేడు ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, కొత్త గవర్నర్తో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు త్రిపుర రాజధాని అగర్తల నుంచి జిష్ణు దేవ్వర్మ, కుటుంబ సభ్యులతో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్రెడ్డి స్వాగతం పలికారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఉన్నారు. అనంతరం విమానాశ్రయంలో సాయుధదళాల నుంచి జిష్ణు దేవ్ వర్మ గౌరవవందనం స్వీకరించారు.