విజయవాడకు రానున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి - ఎందుకంటే?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 4:43 PM IST
Revanth Reddy To attend YSR Jayanti in AP :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సోమవారం రోజున విజయవాడకు వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మంత్రులను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల హైదరాబాద్లో కలిసిన విషయం తెలిసిందే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.