Published : 8 hours ago
దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలి : సీఎం రేవంత్
CM Revanth Inaugurates Datta Mantapam : ఏ రాష్ట్రంలో సంప్రదాయాలను కాపాడటంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు అందించే వారికి గౌరవం దక్కుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అవధూత దత్తపీఠంలో దత్త సభా మండపాన్ని గణపతి సచ్చిదానంద స్వామితో కలిసి ప్రారంభించారు. గణపతి సచ్చిదానంద స్వామిని సత్కరించారు. అంతకుముందు ఆశ్రమంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెంది ప్రజలందరికీ ఉపయోగపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రం సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని, తెలంగాణలో ఆశ్రమం నిర్మించిన గణపతి సచ్చిదానంద స్వామికి ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.