డ్వాక్రా సంఘాలకు రూ.80లక్షలు కుచ్చుటోపి పెట్టిన బిజినెస్ కరస్పాండెంట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 7:54 PM IST
|Updated : Jul 7, 2024, 7:59 PM IST
Cheating in Bank : డ్వాక్రా సంఘాల మహిళలు లక్షలాది రూపాయలు మోసపోయిన ఘటన తర్పు గోదావరి జిల్లా యర్రపాలెంలో చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని బీసీ (బిజినెస్ కరస్పాండెంట్) పాయింట్లో పనిచేస్తున్న బత్తుల నాని చేతిలో మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 70 పొదుపు సంఘాల సొమ్మును బ్యాంకుకు చెల్లించకుండా ఖాతాదారులను మోసం చేశాడని మహిళలు వాపోయారు. సుమారు 80 లక్షల రూపాయల వరకు కాజేశారని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.