national

ETV Bharat / snippets

జలపాతంలో ఈతకు వెళ్లి - బీటెక్​ విద్యార్థి మృతి

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Student Died In Mulugu Waterfalls
Student Died kongala Waterfalls In Mulugu (ETV Bharat)

Student Died In Mulugu Waterfalls: ములుగు జిల్లా వాజేడు మండలంలోని జలపాతం అందాలు చూడటానికి స్నేహితులతో వచ్చిన మంచిర్యాలకు చెందిన అభినయ్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందాడు. అభినయ్ ఘట్​కేసర్ అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు రావడంతో స్నేహితులతో కలిసి ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల దుసుపాటి లొద్ది జలపాతాన్ని వీక్షేంచేందుకు వెళ్లారు.

అక్కడ ఈత కొడుతుండగా అభినవ్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మత్స్యకారులతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details