national

బీఆర్​ఎస్​ నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై డీజీపీకి వినతిప్రతం - సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్​

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 5:07 PM IST

RS PRAVEEN ON SRIDHAR MURDER CASE  RS PRAVEEN MEET DGP ON SRIDHAR CASE
RS Praveen Kumar on BRS Leader Murder Case (ETV Bharat)

RS Praveen Kumar on BRS Leader Murder Case :వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో చోటుచేసుకున్న శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్​ఎస్​ నేత ఆర్​ఎస్‌ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఈ కేసుపై న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. మృతుడు శ్రీధర్‌ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి అయన డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించారు. హత్య జరిగి నాలుగు రోజులవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్​ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ఆక్షేపించారు. హత్యతో సంబంధముందని మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వద్దనే హోంశాఖ ఉన్నందున సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details