ETV Bharat / snippets

రూ.311 కోట్ల మోసం కేసులో నిందితుల ఆస్తులను అటాచ్​ చేసిన ఈడీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 7:54 PM IST

ED Attach IDBI Bank Loan Fraud
ED Attach IDBI Bank Loan Fraud (ETV Bharat)

ED Attach IDBI Bank Loan Fraud : చేపల చెరువుల కోసమని రుణాలు తీసుకొని ఐడీబీఐ బ్యాంకును మోసగించిన కేసులో కీలక నిందితుడు నేరెళ్ల వెంకట రామ్మోహన్​రావు సహా ఇతరులకు చెందిన రూ.19.11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ రూ.71.61 కోట్లు ఉంటుందని తెలిపింది. గతంలో కిసాన్ క్రెడిట్ కార్డులలో అక్రమంగా సాగిన ఈ భారీ కుంభకోణంపై విశాఖపట్నం సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది.

రామ్మోహన్ సహా 11 మంది సభ్యులు అగ్రిగేటర్లుగా ఉండి, 350మంది లబ్దిదారులను చూపిస్తూ ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి వాటి ద్వారా ఐడీబీఐ బ్యాంకు అధికారుల సాయంతో రూ.311.05 కోట్ల రుణాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందుతుల ఏపీ, తెలంగాణాలోని ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.

ED Attach IDBI Bank Loan Fraud : చేపల చెరువుల కోసమని రుణాలు తీసుకొని ఐడీబీఐ బ్యాంకును మోసగించిన కేసులో కీలక నిందితుడు నేరెళ్ల వెంకట రామ్మోహన్​రావు సహా ఇతరులకు చెందిన రూ.19.11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ రూ.71.61 కోట్లు ఉంటుందని తెలిపింది. గతంలో కిసాన్ క్రెడిట్ కార్డులలో అక్రమంగా సాగిన ఈ భారీ కుంభకోణంపై విశాఖపట్నం సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది.

రామ్మోహన్ సహా 11 మంది సభ్యులు అగ్రిగేటర్లుగా ఉండి, 350మంది లబ్దిదారులను చూపిస్తూ ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి వాటి ద్వారా ఐడీబీఐ బ్యాంకు అధికారుల సాయంతో రూ.311.05 కోట్ల రుణాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందుతుల ఏపీ, తెలంగాణాలోని ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.