By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2024, 10:57 PM IST
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ జీవో జారీ
Government Issued GO on Canceling Reverse Tendering System : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో మళ్లీ పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే రివర్స్ టెండరింగ్ను అమలు చేస్తూ గత ప్రభుత్వం 2019 ఆగస్టు 16వ తేదీన జారీ అయిన జీవో నంబర్ 67ను రద్దు చేస్తున్నట్లు గత నెల(ఆగస్టు)28న కేబినెట్ ఆమోదం తెలిపింది. దాని స్థానంలో పాత విధానం అనుసరిస్తామని వెల్లడించింది. తాజాగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.