ETV Bharat / snippets

శ్రీకాకుళంలో స్కూల్​లో సజ్జ కూలి విద్యార్థి మృతి - మంత్రి లోకేశ్ విచారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

lokesh_on_student_death
lokesh_on_student_death (ETV Bharat)

Minister Nara Lokesh On Student Death: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో భవనం సజ్జ కూలి కృష్ణంరాజు అనే 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వైఎస్సార్​సీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాలలో జరిగిన ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. మరో విద్యార్థి గాయపడటం బాధాకరమని అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

Minister Nara Lokesh On Student Death: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో భవనం సజ్జ కూలి కృష్ణంరాజు అనే 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వైఎస్సార్​సీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాలలో జరిగిన ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. మరో విద్యార్థి గాయపడటం బాధాకరమని అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.