Andhra Pradesh Man Hits Rs 2.25 Crore Jackpot In Dubai Lottery : దుబాయ్లో నివసిస్తున్న భారతీయ ఎలక్ట్రీషియన్ రూ.2.25 కోట్ల జాక్పాట్ గెలుచుకున్నాడని ఖలీజ్ టైమ్స్లో నివేదికపేర్కొంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 46 ఏళ్ల ఎలక్ట్రీషియన్ బోరుగడ్డ నాగేంద్రం దుబాయ్లో 1 మిలియన్ (సుమారు రూ. 2.25 కోట్లు) నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు. సంవత్సరాల తరబడి తోచినంత డబ్బు పొదుపు చేస్తూ, తెలివిగా పెట్టుబడి పెట్టాడు ఆ వ్యక్తి చివరకు కోట్ల రూపాయలు సంపాదించాడు.
దుబాయ్లో భారతీయుడిని వరించిన రూ.2.25కోట్ల జాక్పాట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 5:14 PM IST
![దుబాయ్లో భారతీయుడిని వరించిన రూ.2.25కోట్ల జాక్పాట్ ap_man_hits_crores_jackpot_in_dubai_lottery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/1200-675-21793182-thumbnail-16x9-ap-man-hits-crores-jackpot-in-dubai-lottery.jpeg)
ap_man_hits_crores_jackpot_in_dubai_lottery (ETV Bharat)
2019 నుంచి డైరెక్ట్ డెబిట్ ద్వారా నేషనల్ బాండ్లతో తాను ఆదా చేస్తున్నానని నాగేంద్ర తెలిపారు. ఇతనికి 18 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కొడుకు ఉన్నారు. తాను కుటుంబానికి మెరుగైన జీవితాన్ని, పిల్లలకు మంచి విద్యను అందించడానికి యూఏఈకి వచ్చానని నాగేెంద్ర తెలిపాడు.