Aunt Killed Daughter in law for Tea :చాయ్ విషయంలో అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన వివాదం, కోడలి హత్యకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని హసన్నగర్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం టేకులపల్లికి చెందిన అజ్మీరాబేగం(28)కు హసన్నగర్కు చెందిన అబ్బాస్తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైనప్పటి నుంచి కోడలు అజ్మీరా బేగం, అత్త ఫర్జానా బేగంల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయి.
చాయ్ తెచ్చిన తంటా - కోడలి మెడకు చున్నీ బిగించి హత్య చేసిన అత్త
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 5:31 PM IST
aunt_killed_daughter_in_law_for_tea (ETV Bharat)
ఈ క్రమంలోనే గురువారం ఉదయం చాయ్ పెట్టాలని కోడల్ని అత్త ఆదేశించింది. పిల్లలను స్కూల్కు పంపించే హడావుడిలో అజ్మీరా బేగం అత్త మాటను పెడచెవిన పెట్టింది. పిల్లల్ని స్కూల్కు పంపించిన తర్వాత ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఫర్జానా బేగం, కోడలు ధరించిన చున్నీతోనే ఆమెను అంతమొందించింది.