national

రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్ - ఆ ఇద్దరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 12:21 PM IST

Hero Raj Tarun
Hero Raj Tarun Case Update (ETV Bharat)

Hero Raj Tarun Case Update : తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు, తాజాగా మరో ఇద్దరినీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆయనతో పాటు నటి మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు నమోదు చేశారు.

11 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన రాజ్‌తరుణ్‌, ఇటీవల మరో మహిళ (మాల్వి మల్హోత్రా)కు దగ్గరై తనను బెదిరిస్తున్నారంటూ ఈ నెల 4న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి లావణ్య పలు ఆధారాలు సమర్పించడంతో తాజాగా మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details