Old Woman Dies After Dogs Attack :ఓ వృద్ధురాలి ఇంట్లో కుక్కలు చొరబడి ఆమె శరీరాన్ని దారుణంగా తిని చంపిన విషాధ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలు - శరీర భాగాలను పీక్కుతిన్న కుక్కలు
Published : Aug 1, 2024, 1:42 PM IST
ముస్తాబాద్ మండలంలో సేవాళాల్ తండాలో పిట్ల రాజ్యలక్ష్మి(75) అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు. బుధవారం రాత్రి తల్లికి భోజనం ఇచ్చి వెళ్లారు. రాత్రి రాజ్యలక్ష్మిపై శునకాలు దాడిచేశాయి. ఆమె ఇంటికి ముందు తలుపు లేదు. దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉదయం కుమారులు వచ్చినప్పుడు మరణించి ఉంది. ఈ ఘటనలో ఆమె శరీర భాగాలను కుక్కలు దారుణంగా కొరికివేశాయి. వృద్ధురాలిపై దాడిచేసిన ఓ కుక్కను గ్రామస్థులు చంపారు. శునకాల బెడద నుంచి తమను విముక్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.