national

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ కొత్త ఛాంపియన్‌గా క్రెజికోవా

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 9:19 PM IST

Updated : Jul 13, 2024, 9:38 PM IST

source Associated Press
KREJCIKOVA (source Associated Press)

Wimbledon 2024 Womens Single Winner : వింబుల్డన్​ కొత్త యువ‌రాణి కిరీటం అందుకుంది. మహిళల సింగిల్స్‌ కొత్త ఛాంపియన్‌గా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) అవతరించింది. తుదిపోరులో పావోలిని (ఇటలీ)పై 6-2, 2-6, 6-4 తేడాతో గెలుపొందింది. వింబుల్డన్‌ ఫైనల్‌ చేరడం ఈ ఇద్దరికీ ఇదే తొలిసారి. అయితే తాజా విజయంతో క్రెజికోవా రెండో గ్రాండ్‌స్లామ్‌ ఖాతాలో వేసుకున్నట్టైంది. 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ క్రెజికోవా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2016లో సెరెనా విలియమ్స్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన ప్రతి వింబుల్డన్‌లోనూ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్స్​ పుట్టుకొచ్చారు. అదే ఆనవాయితీ ఈ సారి కూడా కొనసాగింది.

కాగా, తొలి సెట్​లో 6-2తో క్రెజికోవా గెలుపొందింది. రెండో సెట్​లో జాస్మినె గట్టి పోటినిచ్చింది. ఇక మూడో సెట్​ను విజ‌యంతో ముగించి ఛాంపియ‌న్‌గా చ‌రిత్ర సృష్టించింది క్రెజికోవా. ట్రోఫీతో పాటు రూ.28.5 కోట్ల ప్రైజ్‌మ‌నీని కూడా సొంతం చేసుకుంది.

Last Updated : Jul 13, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details