పీవీ సింధు ఈజీ విన్ - ప్రీ క్వార్టర్స్లోకి ఎంట్రీ
Published : Jul 31, 2024, 1:57 PM IST
|Updated : Jul 31, 2024, 2:08 PM IST
PV Sindhu Paris Olympics 2024 :పారిస్ ఒలింపిక్స్లో తాజాగా జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు దూకుడుగా ఆడింది. గ్రూప్ స్టేజ్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. ఎస్టోనియాకు చెందిన యంగ్ ప్లేయర్ క్రిస్టిన్ కూబా పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు గ్రూప్-M నుంచి ప్రీ క్వార్టర్స్కు చేరుకుంది. అయితే సింధు ఈ మ్యాచ్ను కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం విశేషం.