national

కాంస్య పతక పోరులో లక్ష్యసేన్‌ ఓటమి - గాయం వేధిస్తున్నా పోరాడిన భారత స్టార్

By ETV Bharat Sports Team

Published : Aug 5, 2024, 7:27 PM IST

source Associated Press
Olympics Lakshya Sen (source Associated Press)

Paris Olympics 2024 Lakshya Sen Lee Zii Jia :పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్​ బ్యాడ్మింటన్‌ ప్లేయర్​ లక్ష్యసేన్‌ పోరాటం ముగిసింది. కాంస్య పతక పోరులో లక్ష్యసేన్‌ మలేషియాకు చెందిన జెడ్‌ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. ఈ పోరులో తొలి గేమ్‌ అలవోకగా నెగ్గిన సేన్‌ రెండు, మూడు గేమ్‌లలో మాత్రం చేతులెత్తేశాడు. కాగా, కుడి మోచేయికి గాయం వేధిస్తున్నా ఈ పోరులో గెలుపు కోసం పోరాడాడు లక్ష్యసేన్. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు పతకం రాకపోయినప్పటికీ లక్ష్యసేన్‌ పోరాటం ఆకట్టుకుంది. వాస్తవానికి తొలి సెట్‌లో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన లక్ష్యసేన్‌ రెండో సెట్‌లో కాస్త డీలాపడ్డాడు. అదే సమయంలో పుంజుకున్న లీ జిజియా రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ మూడు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details