Manika Batra Paris Olympics 2024 : టెబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా పారిస్ ఒలింపిక్స్ వేదికగా ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో రౌండ్ 16లోకి దూసుకెళ్లింది. దీంతో ఒలింపిక్స్లో రౌండ్ 16లోకి చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా మనికా చరిత్రకెక్కింది.
పారిస్ ఒలింపిక్స్లో మనికా బాత్రా రికార్డు - ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా
Published : Jul 30, 2024, 6:59 AM IST
రౌండ్ 32లో ఫ్రాన్స్కు చెందిన ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రీతికా పవడేతో జరిగిన మ్యాచ్లో బాత్రా 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదటి నుంచి దుకుడుగా ఆడిన మనికా ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా 4-0 తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం ప్రపంచ 28వ ర్యాంక్లో ఉన్న బాత్రా, ప్రీక్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన ఎనిమిదో సీడ్ మియూ హిరానోతో లేకుంటే హాంకాంగ్ ప్లేయర్ జు చెంగ్జూతో తలపడనుంది.