national

పారిస్ ఒలింపిక్స్‌లో మనికా బాత్రా రికార్డు - ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా

By ETV Bharat Sports Team

Published : Jul 30, 2024, 6:59 AM IST

Manika Batra Paris Olympics 2024
Manika Batra (Associated Press)

Manika Batra Paris Olympics 2024 : టెబుల్‌ టెన్నిస్‌ స్టార్ మనికా బాత్రా పారిస్ ఒలింపిక్స్ వేదికగా ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో రౌండ్‌ 16లోకి దూసుకెళ్లింది. దీంతో ఒలింపిక్స్‌లో రౌండ్‌ 16లోకి చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా మనికా చరిత్రకెక్కింది.

రౌండ్‌ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంకర్‌ ప్రీతికా పవడేతో జరిగిన మ్యాచ్‌లో బాత్రా 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదటి నుంచి దుకుడుగా ఆడిన మనికా ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా 4-0 తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం ప్రపంచ 28వ ర్యాంక్‌లో ఉన్న బాత్రా, ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ మియూ హిరానోతో లేకుంటే హాంకాంగ్‌ ప్లేయర్ జు చెంగ్జూతో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details