భారత్కు రెండో గోల్డ్ మెడల్- బ్యాడ్మింటన్లో స్వర్ణం నెగ్గిన నితేశ్
Published : Sep 2, 2024, 5:15 PM IST
|Updated : Sep 2, 2024, 7:06 PM IST
India Paralympics 2024:పారిస్ పారాలింపిక్స్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో SL3లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. బ్రిటన్ పారా అథ్లెట్తో సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. తాజాగా నితేశ్ పతకం నెగ్గడం వల్ల భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది.