national

వైఎస్సార్సీపీ నేత బాలినేని రీ కౌంటింగ్‌ పిటిషన్‌పై విచారణ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 8:38 PM IST

HC ON BALINENI EVM PETITION
HC ON BALINENI EVM PETITION (ETV Bharat)

High Court on YSRCP Leader Balineni EVM Petition: ఒంగోలు నియోజకవర్గం పరిథిలోని కొన్ని ఈవీఎంలలో ఓట్లు లెక్కించాలని కోరుతూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి తరఫున వాదనలు పూర్తవ్వగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లు సరిపోల్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. ఈవీఎంలలో ఉన్న సాప్ట్​వేర్ ట్యాంపరింగ్‌పై పరిశీలించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని ఈసీ తరపు లాయర్‌ కోర్టుకు తెలిపారు. ఈవీఎంలో పోలైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్‌లతో సరిపోల్చాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details