BRS MLA Lakshma Reddy Meets Congress leader Jana Reddy :ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ శాసనసభ్యుడు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావటంతో ఆయన సైతం కాంగ్రెస్లో చేరుతారని చర్చ జరుగుతోంది.
Published : Jun 21, 2024, 4:46 PM IST
జానారెడ్డితో లక్ష్మారెడ్డి భేటీ - కాంగ్రెస్ గూటికి చేరతారని గుసగుసలు
BRS MLA Lakshma Reddy Meets Congress leader Jana Reddy (ETV Bharat)
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందటంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, కమలం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే జరిగితే కమలం బలోపడుతుందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరతారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.