తెలంగాణ

telangana

ETV Bharat / snippets

ఇండియా, పాక్ మ్యాచ్‌పై ఆ ప్రశ్న అడగడమే పాపం- సెక్యూరిటీ చేతిలో యూట్యూబర్ బలి

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 8:18 AM IST

Updated : Jun 12, 2024, 11:56 AM IST

Pakistan Youtuber Shot Dead
Pakistan Youtuber Shot Dead (Associated Press, ANI)

Pakistan Youtuber Shot Dead :టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇటీవల జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్​ రోజు ఓ పాకిస్థానీ యూట్యూబర్‌ సెక్యూరిటీ గార్డ్‌ చేతిలో హతమయ్యాడు. మ్యాచ్ మొదలుకాకముందు వ్లాగ్‌ చేస్తున్న యూట్యూబర్​ను సెక్యూరిటీ గార్డ్ కాల్చి చంపినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.

పాక్ మీడియా ప్రకారం, మ్యాచ్​ గురించి అభిప్రాయాలు తెలుసుకుని వ్లాగ్‌ చేయడానికి సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ కరాచీలోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లాడు. అతడు వ్లాగ్‌ షూట్‌ చేస్తూ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును మ్యాచ్‌ గురించి పలుమార్లు అడిగాడు. అతడు చెప్పడానికి నిరాకరించాడు. అయినా యూట్యూబర్‌ వినకుండా వీడియో చిత్రీకరిస్తుండడం వల్ల ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డ్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యూట్యూబర్​ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Last Updated : Jun 12, 2024, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details